వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్‌

- December 01, 2016 , by Maagulf
వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్‌

విమాన టిక్కెట్‌ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నడిచిన జగన్నాథన్‌ సెల్వరాజన్‌ అనే 48 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఉదంతాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, దుబాయ్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. తక్షణం ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం తనకు తెలియజేయాలని ఆమె కోరారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ నేపథ్యంలో రెండేళ్ళపాటు సుమారు 1000 కిలోమీటర్ల దూరం నడిచాడు జగన్నాథన్‌ సెల్వరాజ్‌. దుబాయ్‌ కోర్టు నుంచి తాను నివసిస్తున్న సోనాపూర్‌ అకామడేషన్‌ వరకు 22 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దుబాయ్‌కి వెళ్ళాడు. ప్రతి రోజూ సుమారు 50 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు నడవాల్సి వచ్చేదని వాపోయాడు సెల్వరాజ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com