పోలీసులపై కాల్పులు: ముగ్గురికి మరణ శిక్ష

- December 01, 2016 , by Maagulf
పోలీసులపై కాల్పులు: ముగ్గురికి మరణ శిక్ష

జెడ్డా: రియాద్‌లోని స్పెషల్‌ క్రిమినల్‌ కోర్టు, ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష విధించింది. పోలీస్‌ పెట్రోల్‌పైనా, ఖాతిఫ్‌ ప్రిజన్‌పైనా కాల్పులు జరిపిన నేరంలో వీరికి ఈ మరణ శిక్షను విధించడం జరిగింది. ఈ కేసులో మరో వ్యక్తికి 12 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. పోలీసులపై కాల్పులు జరపడం, ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడం, అలాగే వెపన్స్‌ని సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్‌ చేయడం తదితర కేసుల్లో నాలుగో వ్యక్తి నిందితుడు. మొదటి నిందితుడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేల్చిన న్యాయస్థానం ఆ నిందితుడి చర్యల్ని తీవ్రంగా ఖండించింది. మెషీన్‌ గన్లతోనూ, పిస్టోళ్ళతోనూ దాడులు చేయడం దుర్మార్గమని న్యాయస్థానం ఆగ్రహించింది. దేశంలోకి అక్రమంగా ఆయుధాల్ని తీసుకొచ్చి, వాటిపై కొందరికి శిక్షణ ఇప్పించినట్లు నిందితుడిపై నేరారోపణలు నిరూపించబడ్డాయి. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేందుకుగాను కొందరిని కింగ్‌డమ్‌లోకి అక్రమంగా నిందితుడు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. రెండో నిందితుడు, మూడో నిందితుడిపైన కూడా ఇవే తరహా నేరాలు నిరూపించబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com