పోలీసులపై కాల్పులు: ముగ్గురికి మరణ శిక్ష
- December 01, 2016
జెడ్డా: రియాద్లోని స్పెషల్ క్రిమినల్ కోర్టు, ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష విధించింది. పోలీస్ పెట్రోల్పైనా, ఖాతిఫ్ ప్రిజన్పైనా కాల్పులు జరిపిన నేరంలో వీరికి ఈ మరణ శిక్షను విధించడం జరిగింది. ఈ కేసులో మరో వ్యక్తికి 12 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. పోలీసులపై కాల్పులు జరపడం, ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడం, అలాగే వెపన్స్ని సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్ చేయడం తదితర కేసుల్లో నాలుగో వ్యక్తి నిందితుడు. మొదటి నిందితుడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేల్చిన న్యాయస్థానం ఆ నిందితుడి చర్యల్ని తీవ్రంగా ఖండించింది. మెషీన్ గన్లతోనూ, పిస్టోళ్ళతోనూ దాడులు చేయడం దుర్మార్గమని న్యాయస్థానం ఆగ్రహించింది. దేశంలోకి అక్రమంగా ఆయుధాల్ని తీసుకొచ్చి, వాటిపై కొందరికి శిక్షణ ఇప్పించినట్లు నిందితుడిపై నేరారోపణలు నిరూపించబడ్డాయి. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేందుకుగాను కొందరిని కింగ్డమ్లోకి అక్రమంగా నిందితుడు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. రెండో నిందితుడు, మూడో నిందితుడిపైన కూడా ఇవే తరహా నేరాలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









