పోలీసులపై కాల్పులు: ముగ్గురికి మరణ శిక్ష
- December 01, 2016
జెడ్డా: రియాద్లోని స్పెషల్ క్రిమినల్ కోర్టు, ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష విధించింది. పోలీస్ పెట్రోల్పైనా, ఖాతిఫ్ ప్రిజన్పైనా కాల్పులు జరిపిన నేరంలో వీరికి ఈ మరణ శిక్షను విధించడం జరిగింది. ఈ కేసులో మరో వ్యక్తికి 12 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. పోలీసులపై కాల్పులు జరపడం, ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడం, అలాగే వెపన్స్ని సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్ చేయడం తదితర కేసుల్లో నాలుగో వ్యక్తి నిందితుడు. మొదటి నిందితుడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేల్చిన న్యాయస్థానం ఆ నిందితుడి చర్యల్ని తీవ్రంగా ఖండించింది. మెషీన్ గన్లతోనూ, పిస్టోళ్ళతోనూ దాడులు చేయడం దుర్మార్గమని న్యాయస్థానం ఆగ్రహించింది. దేశంలోకి అక్రమంగా ఆయుధాల్ని తీసుకొచ్చి, వాటిపై కొందరికి శిక్షణ ఇప్పించినట్లు నిందితుడిపై నేరారోపణలు నిరూపించబడ్డాయి. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేందుకుగాను కొందరిని కింగ్డమ్లోకి అక్రమంగా నిందితుడు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. రెండో నిందితుడు, మూడో నిందితుడిపైన కూడా ఇవే తరహా నేరాలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







