ఇకపై ఆర్మీ అధికారిక వాహనంగా టాటా సఫారీ స్ట్రామ్
- December 06, 2016
ఆర్మీ వాహనమంటే మనకు మారుతి జిప్సీ గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు ఆర్మీ తన వాహనాలను మార్చాలని నిర్ణయించింది. మారుతి జిప్సీ స్థానంలో టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టాటా మోటార్స్ సంస్థకు 3198 వాహనాల ఆర్డర్లను ఆర్మీ ఇచ్చినట్లు తెలిసింది. ఎంతో కాలంగా ఆర్మీ వాహనంగా మారుతి జిప్సీని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల స్థానంలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఉండే ఎస్యూవీ వాహనాలను తీసుకురావాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. మహీంద్ర కంపెనీ నుంచి పోటీ ఎదురైనప్పటికీ టాటా మోటార్స్ ఈ డీల్ను దక్కించుకున్నట్లు సమాచారం.
వాహనాల మార్పుపై భారత సైన్యం అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద 30 వేలకుపైగా జిప్సీ వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్తో నడిచే వాహనాలు. వీటి స్థానంలో తీసుకువచ్చే టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







