ఇకపై ఆర్మీ అధికారిక వాహనంగా టాటా సఫారీ స్ట్రామ్
- December 06, 2016
ఆర్మీ వాహనమంటే మనకు మారుతి జిప్సీ గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు ఆర్మీ తన వాహనాలను మార్చాలని నిర్ణయించింది. మారుతి జిప్సీ స్థానంలో టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టాటా మోటార్స్ సంస్థకు 3198 వాహనాల ఆర్డర్లను ఆర్మీ ఇచ్చినట్లు తెలిసింది. ఎంతో కాలంగా ఆర్మీ వాహనంగా మారుతి జిప్సీని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల స్థానంలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఉండే ఎస్యూవీ వాహనాలను తీసుకురావాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. మహీంద్ర కంపెనీ నుంచి పోటీ ఎదురైనప్పటికీ టాటా మోటార్స్ ఈ డీల్ను దక్కించుకున్నట్లు సమాచారం.
వాహనాల మార్పుపై భారత సైన్యం అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద 30 వేలకుపైగా జిప్సీ వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్తో నడిచే వాహనాలు. వీటి స్థానంలో తీసుకువచ్చే టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







