ఇకపై ఆర్మీ అధికారిక వాహనంగా టాటా సఫారీ స్ట్రామ్‌

- December 06, 2016 , by Maagulf
ఇకపై ఆర్మీ అధికారిక వాహనంగా టాటా సఫారీ స్ట్రామ్‌

ఆర్మీ వాహనమంటే మనకు మారుతి జిప్సీ గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు ఆర్మీ తన వాహనాలను మార్చాలని నిర్ణయించింది. మారుతి జిప్సీ స్థానంలో టాటా సఫారీ స్ట్రామ్‌ వాహనాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టాటా మోటార్స్‌ సంస్థకు 3198 వాహనాల ఆర్డర్లను ఆర్మీ ఇచ్చినట్లు తెలిసింది. ఎంతో కాలంగా ఆర్మీ వాహనంగా మారుతి జిప్సీని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల స్థానంలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఉండే ఎస్‌యూవీ వాహనాలను తీసుకురావాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. మహీంద్ర కంపెనీ నుంచి పోటీ ఎదురైనప్పటికీ టాటా మోటార్స్‌ ఈ డీల్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.

వాహనాల మార్పుపై భారత సైన్యం అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద 30 వేలకుపైగా జిప్సీ వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్‌తో నడిచే వాహనాలు. వీటి స్థానంలో తీసుకువచ్చే టాటా సఫారీ స్ట్రామ్‌ వాహనాలు డీజిల్‌తో నడుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com