అమ్మ మృతి కి సంతాపం తెలిపిన 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్'

- December 07, 2016 , by Maagulf
అమ్మ మృతి కి సంతాపం తెలిపిన 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్'

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల  తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్ తమ సంతాపాన్ని తెలియచేశారు,అమ్మ గా అందరి మన్ననలు పొందిన జయలలిత 

తమిళ రాష్ట్రము లో తిరుగు లేని నాయకురాలుగా ప్రజల అభి మానాన్ని పొందారని , గొప్ప జనాకర్షణ గల నేత తో పాటు మహిళా శక్తి మరియు  పోరాట శక్తికి అని  నిదర్శనం అన్నారు  జయలలిత సాధించిన విజయాలు మహిళా లోకానికి స్ఫూర్తి పంచి పెడుతూనే ఉంటాయని 
తమిళ రాష్ట్రము లో తెలుగు వారి కి ఒక ప్రత్యేక గౌరవం ఇచ్చిన ఒక మహా నాయకురాలని కొనియాడారు, జయలలిత మృతి ఒక తీరని లోటు అని అన్నారు. దేశంలో ఒక గొప్ప రాజకీయ నేతను కోల్పోయమన్నారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని  ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com