పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం...
- December 07, 2016
పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.
ఈ విమానం ఖైబర్ ఫంక్తూన్లో అబాటోబాద్ సమీపంలో కూలిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐతే విమానం కూలిన ప్రాంతం అబోటోబాద్లో ఉండటంతో ఉగ్రవాదులేమయినా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే విమానంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







