పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం...
- December 07, 2016
పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.
ఈ విమానం ఖైబర్ ఫంక్తూన్లో అబాటోబాద్ సమీపంలో కూలిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐతే విమానం కూలిన ప్రాంతం అబోటోబాద్లో ఉండటంతో ఉగ్రవాదులేమయినా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే విమానంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







