దుబాయ్లో రోడ్డు దుర్ఘటన
- December 08, 2016
దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండడంతో రహదారి సరిగా కనిపించక పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రక్తస్రావం తీవ్రంగా కావడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక రాజస్థాన్లో ఏడు వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. జైపూర్-ఆగ్రా హైవేపై ఒక ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో దాని వెనుక వస్తున్న వాహనాలన్నీ ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







