దుబాయ్‌లో రోడ్డు దుర్ఘటన

- December 08, 2016 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు దుర్ఘటన

దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండడంతో రహదారి సరిగా కనిపించక పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రక్తస్రావం తీవ్రంగా కావడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక రాజస్థాన్‌లో ఏడు వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. జైపూర్‌-ఆగ్రా హైవేపై ఒక ట్యాంకర్‌ ప్రమాదానికి గురవడంతో దాని వెనుక వస్తున్న వాహనాలన్నీ ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com