దుబాయ్లో రోడ్డు దుర్ఘటన
- December 08, 2016
దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండడంతో రహదారి సరిగా కనిపించక పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రక్తస్రావం తీవ్రంగా కావడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక రాజస్థాన్లో ఏడు వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. జైపూర్-ఆగ్రా హైవేపై ఒక ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో దాని వెనుక వస్తున్న వాహనాలన్నీ ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







