ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొంగల అరెస్ట్
- December 08, 2016మనామా: ఓ జ్యూస్ బాటిల్పై ఫింగర్ ప్రింట్స్, అలాగే సిసిటివి ఫుటేజ్ ఆధారంగా చేసుకుని, మనామా కోల్డ్ స్టోర్స్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్కి మార్గం సుగమం అయ్యింది. మనామాలోని అబుల్ ఘాజల్ ఏరియాలోని పలు స్టోర్స్లో ఆయుధాలు ధరించిన వ్యక్తులు దోపిడీలకు పాల్పడుతున్నారు. వరుసగా ఒకదాని తర్వాత ఒక కోల్డ్ స్టోర్ని దోపిడీ చేస్తూ వచ్చారు. మొదటి రెండు కోల్డ్ స్టోర్స్లో ఎలాంటి సిసిటివి లేకపోవడంతో నిందితుల ఆచూకీ కష్టమయ్యింది. అయితే మూడో స్టోర్లో ఉన్న సిసిటివి ఫుటేజ్తో నిందితులు ఎవరన్నదీ తెలుసుకోగలిగారు. అరెస్టు చేసిన దొంగల్ని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. నిందితుల్లో ఒక వ్యక్తి జూస్ బాటిల్ని చేత్తో పట్టుకోవడంతో దానిపై ఏర్పడ్డ ఫింగర్ ప్రింట్స్తో నేరారోపణ సులభతరమయ్యింది. ఆ వ్యక్తుల నుంచి కారుని, అలాగే ఓ కత్తిని, కొంత మొత్తంలో డబ్బునీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్ని స్టోర్స్లోనూ విధిగా సిసిటివిలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







