మరణ శిక్ష పడ్డ 10 మంది భారత యువకులకు కాన్సులర్ సాయం
- December 08, 2016
అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, 10 మంది భారతీయ యువకులకు కాన్సులర్ అసిస్టెన్స్ అందిస్తోంది. పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఈ పది మంది భారతీయ యువకులకు మరణ శిక్ష పడింది. కింది కోర్టు ఈ నెల మొదట్లో ఆ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆ యువకులకు కాన్సులర్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ కౌన్సెలర్ కమ్యూనిటీ వెల్ఫేర్ - దినేష్ కుమార్ చెప్పారు. అల్ అయిన్ జైలులో ఉన్న ఆ వ్యక్తుల్ని ఇటీవల తాను కలిసినట్లు కుమార్ చెప్పారు. తమ ప్రయత్నాలు ఫలించి, వారికి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు కుమార్ వెల్లడించారు. ఒకవేళ క్షమాభిక్ష లభిస్తే, మొత్తం 11 మంది నిందితులు 200,000 దిర్హామ్లు బాధిత కుటుంబానికి యూఏఈ చట్టాల ప్రకారం అందించవలసి ఉంటుంది. నిందితుల్లో చాలామంది ట్వంటీస్లోనే ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







