మరణ శిక్ష పడ్డ 10 మంది భారత యువకులకు కాన్సులర్‌ సాయం

- December 08, 2016 , by Maagulf
మరణ శిక్ష పడ్డ 10 మంది భారత యువకులకు కాన్సులర్‌ సాయం

అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ, 10 మంది భారతీయ యువకులకు కాన్సులర్‌ అసిస్టెన్స్‌ అందిస్తోంది. పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఈ పది మంది భారతీయ యువకులకు మరణ శిక్ష పడింది. కింది కోర్టు ఈ నెల మొదట్లో ఆ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆ యువకులకు కాన్సులర్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ కౌన్సెలర్‌ కమ్యూనిటీ వెల్‌ఫేర్‌ - దినేష్‌ కుమార్‌ చెప్పారు. అల్‌ అయిన్‌ జైలులో ఉన్న ఆ వ్యక్తుల్ని ఇటీవల తాను కలిసినట్లు కుమార్‌ చెప్పారు. తమ ప్రయత్నాలు ఫలించి, వారికి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు కుమార్‌ వెల్లడించారు. ఒకవేళ క్షమాభిక్ష లభిస్తే, మొత్తం 11 మంది నిందితులు 200,000 దిర్హామ్‌లు బాధిత కుటుంబానికి యూఏఈ చట్టాల ప్రకారం అందించవలసి ఉంటుంది. నిందితుల్లో చాలామంది ట్వంటీస్‌లోనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com