పెరుగు చేప
- December 08, 2016
కావలసిన పదార్థాలు: ముల్లులేని చేపముక్కలు (నలుపలకలుగా ఉన్నవి) - 800 గ్రా., నూనె - 80 గ్రా., యాలకులు - 4, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లం పేస్టు - 40 గ్రా., ఉల్లిపాయ పేస్టు - 250 గ్రా., గిలక్కొట్టిన పెరుగు - 250 గ్రా., పసుపు - 1 టీ స్పూను, మసాలా పొడి - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నీరు - 150 మిల్లీ లీటర్లు.
తయారుచేసే విధానం: లోతులేని కడాయిలో నూనె వేడిచేసి చేప ముక్కల్ని రెండు వైపులా వేగించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేసి యాలకుల్ని , అల్లం పేస్టుని వేసి వేగించుకోవాలి. ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, పెరుగుని వేసి సన్నని సెగమీద చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత నీరుని జతచేయాలి. అది మరుగుతుండగా వేగించి పక్కనుంచుకున్న చేపముక్కల్ని వేసి ఉడికించి, మసాలాపొడి వేసి దించేసి వేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







