పెరుగు చేప
- December 08, 2016
కావలసిన పదార్థాలు: ముల్లులేని చేపముక్కలు (నలుపలకలుగా ఉన్నవి) - 800 గ్రా., నూనె - 80 గ్రా., యాలకులు - 4, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లం పేస్టు - 40 గ్రా., ఉల్లిపాయ పేస్టు - 250 గ్రా., గిలక్కొట్టిన పెరుగు - 250 గ్రా., పసుపు - 1 టీ స్పూను, మసాలా పొడి - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నీరు - 150 మిల్లీ లీటర్లు.
తయారుచేసే విధానం: లోతులేని కడాయిలో నూనె వేడిచేసి చేప ముక్కల్ని రెండు వైపులా వేగించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేసి యాలకుల్ని , అల్లం పేస్టుని వేసి వేగించుకోవాలి. ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, పెరుగుని వేసి సన్నని సెగమీద చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత నీరుని జతచేయాలి. అది మరుగుతుండగా వేగించి పక్కనుంచుకున్న చేపముక్కల్ని వేసి ఉడికించి, మసాలాపొడి వేసి దించేసి వేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









