మానవ హక్కుల పరిరక్షణకు జాయింట్ యాక్షన్ అవసరం
- December 10, 2016
మనామా: మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సి ఉందనీ, అలా జరిగినప్పుడే శాంతియుత జీవనం ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందని ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రిన్స్ ఖలీఫా ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్టాండ్ అప్ ఫర్ సమ్వన్స్ హ్యూమన్ రైట్స్ టుడే' అనే థీమ్ని మరింతగా ప్రాచుర్యంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో బహ్రెయిన్ ఎంతో శ్రమిస్తోందనీ, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారాయన. అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగంలో పనిచేయడానికి బహ్రెయిన్ ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్స్ ఖలీఫా తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఐక్యరాజ్య సమితి చేపడ్తున్న చర్యల్ని ప్రిన్స్ ఖలీఫా అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









