తీవ్రవాదం కారణంగా ఇరువురు పౌరులకు జైలుశిక్ష

- December 10, 2016 , by Maagulf
తీవ్రవాదం కారణంగా ఇరువురు పౌరులకు జైలుశిక్ష

జెడ్డా : సిరియా ప్రయాణించి జాబ్స్ అల్- నుస్ర లో ఆయుధ శిక్షణ తీసుకొనివచ్చిన ఒక పౌరునికి ఆరు సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. అంతేకాక ఆ నిందితుడు రాజ్యానికి వ్యతిరేకంగా సవాలు చేయడమే కాక దేశం యొక్క ప్రభుత్వ మరియు మత పండితులను అవమానిస్తూ ప్రకటనలు చేస్తూ వివాదం నెలకొని ఉన్న మండలాలలో ప్రజలు పోరాడాలని రెచ్చగొడ్తు సామాజిక మీడియా ద్వారా తీవ్రవాదులతో అనుబంధం కల్గి ఉండటంతో సహా పలు ఇతర ఆరోపణలు మోపబడ్డాయి.6 సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాల కాలం ఫిబ్రవరి 13 వ తేదీ 2013 న జారీ కాబడిన ఆజ్ఞపత్రం ఉల్లంఘించినందుకు, మిగిలిన 3  సంవత్సరాల శిక్ష  సైబర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించబడింది. ప్రతివాది యొక్క ట్విట్టర్ ఖాతాని మూసివేయాలని కోర్టు ప్రకటించింది. సైబర్ నేరాల నిబంధనలు ఆధారంగా అధికరణం13 ప్రకారం నిషేధించారు.అంతేకాక కాకుండా జైలుశిక్ష పూర్తయిన తర్వాత  ఆరేళ్ళపాటు  ఎటువంటి ప్రయాణం చేయకూడదని నిషేధం విధించింది. ఆదివారం, ఇదే కోర్టు, సౌదీ పౌరునికి 30 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. కింగ్డమ్  ప్రభుత్వ తీరుని అవినీతికి పాల్పడుతున్న విషయంపై అవమానకరమైన వాఖ్యలు చేశాడు. అంతేకాక  క్వాటిప్ ప్రాంతంలో  లో మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు తుపాకీలను ఉపయోగించి భద్రతా నిబంధనలన ఉల్లంఘించినందుకు సౌదీ జాతీయునికి శిక్ష విధించారు.అంతేకాక ఆ నిందితుడు అప్అమియహ్ పోలీసు స్టేషన్ సమీపంలో ఒక గ్యాస్ పైపులైన్ పేల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీనితో నిందితునికి 10,000 సౌదీ రియళ్ళు జరిమానా మరియు 30 ఏళ్ల జైలుశిక్ష  ఆ తర్వాత  ప్రయాణ నిషేధం విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com