రోడ్డు ప్రమాదం: వ్యక్తికి మూడేళ్ళ జైలు, జరీమానా
- December 10, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 18,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ఐదుగురు వ్యక్తుల మృతికి కారణమైన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. మృతులు ఫిలిప్పీన్కి చెందినవారు. అలాగే 200,000 ఖతారీ రియాల్స్ మొత్తాన్ని ఒక్కో మృతుడి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 18 ఏళ్ళ యువకుడు రిజిస్ట్రేషన్, రోడ్ పర్మిట్ గడువు తీరిన కారుని అతి వేగంగా నడుపుతూ ఎయిర్ఫోర్స్ స్ట్రీట్ నుంచి డిపాచ్యూర్స్ వైపు నడిపాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపు తప్పి, పార్క్ చేసిన ఉన్న కారుని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, నిందితుడికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాల్నీ సమర్పించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







