టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది....
- December 10, 2016
టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ముఖ్య నగరమైన ఇస్తాంబుల్లో శనివారం రాత్రి సంభవించిన జంట పేలుళ్లలో 29 మంది మృతిచెందగా.. 166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు. తొలి పేలుడు ఫుట్బాల్ స్టేడియం బయట.. రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా.. రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







