టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది....
- December 10, 2016
టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ముఖ్య నగరమైన ఇస్తాంబుల్లో శనివారం రాత్రి సంభవించిన జంట పేలుళ్లలో 29 మంది మృతిచెందగా.. 166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు. తొలి పేలుడు ఫుట్బాల్ స్టేడియం బయట.. రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా.. రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం









