ప్రవాసీ అవార్డుల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన తాజ్

- December 12, 2016 , by Maagulf

 

సమాజం లోని సేవ భావన ను గుర్తించి దాన్ని ప్రోత్సాహించడం అనేది ఒక గొప్ప విషయం
 సమాజ శ్రేయస్సు కోసం సంక్షేమ కార్య క్రమాల  ను నిర్వహిస్తూ .తోటి మానవులకు సేవ చేస్తున్నాసమాజ సేవకులను గుర్తించి వారికో గుర్తింపు ఇవ్వడం మరియు వారిని ప్రోత్చహించే విధంగా  సన్మానించడం నిజంగా ఒక గొప్ప కార్యం, అసలైన సమాజ సేవ.కూడా.
తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ లో బాగా మై చురుకైన సమాజ సేవకుడిగా అందరి మెప్పు పొందిన శేషు కుమార్ పితానికు   ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డు 2016   అవార్డు కు ఎంపిక కావడం తమ సంఘ సభ్యులందరికి ఆనందంగా ఉందని సంఘ అధ్యక్షులు యూసఫ్ అన్నారు,శేషు కుమార్, తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్  "రాబిగ్" పట్టన విభాగానికి భాద్యులు గా సేవలను అందిస్తున్నారు .
గత ఎంతో కాలంగా తమ సమాజ సేవ తో ఎంతో మందిని భాదితులను ఆదుకున్నశేషు కుమార్ కు ఈ అరుదైన  అవకాశం దక్కడం అనేది ఒక అదృష్టాంగా భావిస్తూ. సేవలను గుర్తించి అవార్డు ద్వారా సన్మానిస్తున్న కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక తో పాటు వ్యవస్థాపకులు  భీంరెడ్డి  మంద కి ,అవార్డుల కమిటీ అధ్యక్షులు ప్రొ. అడపా సత్యనారాయణ కి ధన్య వాదాలు తెలిపారు.. మున్ముందు కూడా ఇలాంటి సేవ ప్రోత్చహిత కార్య క్రమాల ద్వారా సమాజ సేవకులకు ప్రోత్సాహించాలని ఆశ భావాన్ని వ్యక్త పరిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com