ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది...
- December 13, 2016
త్తరాదిని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిదవుతున్నా సూర్యోదయం కాలేదు. దీంతో రోడ్ల మీద జనసంచారం కనిపించడం లేదు. ఉదయాన్నే బయటకు వెళ్లాల్సిన కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విజుబులిటీ తక్కువగా ఉంది. వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. మసక చీకటి ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరతాయని అధికారులు తెలిపారు. .అటు వారణాసిలో పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వెలుతురు తక్కువగా ఉండడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లపై జనాలు, వాహనాల సందడి కనిపించడం లేదు. అరకొరగానే వాహనాలు రోడ్డెక్కాయి. పొగ మంచుతో పాటు చలి ఎక్కువగా ఉండడంతో వాకింగ్ వెళ్లే వారు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జనం చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో చలి పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
-
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







