నగదు రహిత పథకాలను క్రిస్మస్ కానుకలుగా అభివర్ణించిన మోదీ
- December 15, 2016
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రకటించిన అదృష్ట వినియోగదారుడు, డిజీ ధన్ వ్యాపారి పథకాలను క్రిస్మస్ కానుకలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ''నగదు రహిత, అవినీతి రహిత భారతానికి ఇవి ఊపు తెస్తాయి'' అని ట్వీట్ చేశారు.
షరతులు వర్తిస్తాయి..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఎ్సఎ్సడీ, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్), రూపే కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వారు మాత్రమే అర్హులు. ప్రైవేటుకార్డులైన వీసా, మాస్టర్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఈ పథకం వర్తించదు.
కనీసం 50 రూపాయలు, గరిష్ఠంగా రూ.3 వేలు చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
వినియోగదారుడు-వ్యాపారి, వినియోగదారుడు-ప్రభుత్వ సంస్థల మధ్య జరిగే చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏఈపీఎస్ చెల్లింపులు అన్నింటినీ పరిగణిస్తారు. ఆయా చెల్లింపులు చేసినప్పుడు వెలువడే లావాదేవీ ఐడీ (ట్రాన్సాక్షన ఐడీ) ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో లక్కీ వినియోగదారులు, వ్యాపారులను నజరానాలకు ఎంపిక చేస్తారు. ఈ లావాదేవీలన్నింటినీ భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన (ఎనపీసీఐ) మదింపు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని తర్వాత టెక్నికల్, సెక్యూరిటీ ఆడిట్ చేయనున్నారు.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
పెద్దనోట్లు రద్దయిన మరుసటి రోజు (నవంబరు 9) నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులంతా లక్కీ డ్రాకు అర్హులే. మొదటి డ్రా ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా తీస్తారు. మెగా డ్రా 2017 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా తీస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









