కోటిలింగాలను దర్శించుకున్న బాలకృష్ణ

- December 16, 2016 , by Maagulf
కోటిలింగాలను దర్శించుకున్న  బాలకృష్ణ

ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పర్యటిస్తున్నారు. ఉదయం కోటిలింగాల చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నగరంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన కోటిలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్‌ ఉన్నారు.
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన కోటిలింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com