కోటిలింగాలను దర్శించుకున్న బాలకృష్ణ
- December 16, 2016
ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పర్యటిస్తున్నారు. ఉదయం కోటిలింగాల చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన కోటిలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్ ఉన్నారు.
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన కోటిలింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







