ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం

- December 18, 2016 , by Maagulf


 

ఆదివారం తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో ప్రవాసీ మిత్ర, కొయలిషన్‌ ఆఫ్‌ ఓవర్సిస్‌ తెలంగాణ అసోసియేషన్స్‌ (కోటా) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిశభ కనబర్చిన ఆసే్ట్రలియా, కువైట్‌, మలేషియా, న్యూజిలాండ్‌, నైజిరియా, ఓమాన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, సౌత్‌ఆఫ్రికా, యూఏఈ, యూకే తదితర దేశాలకు చెందిన సుమారు 26మంది ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ)లకు ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. వీరితో పాటు భారతదేశంలో సేవలందిస్తున్న ప్రవాసీయులను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు ఖ్యాతి, దేశ ప్రగతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన సూచించారు. అవార్డుగ్రహీతలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో నివసించినా భారతమాత ముద్దు బిడ్డలుగా జీవిస్తామని వారన్నారు. విదేశాలలో మన దేశం వారికి కలిగే సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి సన, సంస్థ అధ్యక్షుడు మంద భీమ్‌రెడ్డి, దర్శకుడు రేలంగి నర్సింహారావు, అడప సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com