బెర్లిన్లో ట్రక్కు బీభత్సం, 12మంది మృతి
- December 20, 2016
జర్మనీ రాజధాని బెర్లిన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా షాపింగ్ చేసుకుందామని మార్కెట్కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్లోని కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







