మన అరుదైన నోటు దుబాయ్లో!
- December 20, 2016
ఒకప్పుడు భారత్లో రూ. పదివేలు నోటు కూడా చలామణిలో ఉండేది. 1978లో అప్పటి జనతా ప్రభుత్వం ఈ నోటును రద్దుచేసింది. తాజాగా మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో దుబాయ్లో ఇప్పుడు ఈ పెద్దనోటు హల్చల్ చేస్తోంది. దుబాయ్లో నివసిస్తున్న భారత సంతతి వాసి రామ్కుమార్ ప్రస్తుతం ఈ పదివేల నోటును ప్రదర్శనకు పెట్టారు. వృత్తిరీత్య న్యూమిస్మేటిస్ట్ (అరుదైన కరెన్సీ, నాణెల సేకరణకర్త) అయిన ఆయన గత ఏడాది భారత్లో ఓ కలెక్టర్ వద్ద నుంచి ఈ అరుదైన నోటును సేకరించినట్టు తెలిపారు.
1978లో భారత రిజర్వు బ్యాంకు పదివేల నోట్లను రద్దుచేసేనాటికి కేవలం 346 నోట్లు మాత్రమే చలామణిలో ఉండేవి. అందులో పదివేల నోట్లు పదిమాత్రం ఆర్బీఐకి చేరలేదు. ప్రస్తుతం ఇవి అరుదైన జ్ఞాపకాలు మిగిలిపోగా.. అందులో దుబాయ్లో దర్శనమిచ్చే ఏకైక పదివేల నోటు ఇదేనని రామ్కుమార్ తెలిపారు. పదివేల నోటును సేకరించాలన్న కల తనకు ఎప్పటి నుంచో ఉండేదని, అతికష్టం మీద భారత్లో ఓ కలెక్టర్ నుంచి దీనిని సేకరించానని, దీని ప్రస్తుత విలువ ఎంత అంటే తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







