మరోసారి 'నిర్భయ్' క్షిపణి విఫలం
- December 21, 2016
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. ఈ ప్రయోగం విఫలమవడం ఇది మూడోసారి. ఒడిశాలోని బాలాసోర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని బుధవారం ప్రయోగించారు. భూ ఉపరితలంపై వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందించిన ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదిక నుంచి ప్రయోగించగా.. నిర్దేశిత మార్గంలో ఇది వెళ్లలేదని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి.మార్చి 2013లో మొదటిసారి నిర్భయ్ క్షిపణి ప్రయోగం చేపట్టగా అది పూర్తిగా విఫలమైంది. అక్టోబర్ 2014లో చేపట్టిన రెండో ప్రయోగం విజయవంతమైంది. అయితే నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులు ఇది 1,010 కి.మీ ప్రయాణించింది. అక్టోబర్ 2015న చేపట్టిన మూడో ప్రయోగం, ఇవాళ చేపట్టిన నాలుగో ప్రయోగం పూర్తిగా విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







