శుక్రవారం ప్రారంభం కానున్న నూతన మస్జిద్..

- December 21, 2016 , by Maagulf
శుక్రవారం ప్రారంభం కానున్న నూతన మస్జిద్..

మనామా: దివంగత షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పేరిట నిర్మింపబడిన మస్జిద్ ను  శ్రీశ్రీ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా శుక్రవారం ( రేపు ) అధికారికంగా ప్రారంభించనున్నారు.డియార్ అల్ మూహ్యాయరాక్ హార్ట్  లోపల ఉన్న అరబ్-ఇస్లామిక్ నిర్మాణం ప్రేరణగా ప్రత్యేక సాంకేతిక నమూనాలతో దివంగత  షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మస్జిద్ నిర్మితమయ్యంది. మస్జిద్ కళాత్మక నమూనాలు అలంకరించిన ఒక విశేష గోపురం మరియు 45-మీటర్ల ఎత్తులో ఒక  స్తంభం కలిగి ఉంటుంది.నగరం యొక్క ప్రధాన ద్వారం సమీపంలో మాస్టర్ ప్రణాళిక ప్రకారం డియార్ అల్ మూహ్యాయరాక్ మరియు పరిసర ప్రాంతాలు భక్తులు సులభంగా హాజరయ్యేందుకు ఈ మస్జిద్ అనువుగా ఉంది. సుమారు 1,050 భక్తులు ఇందులో ప్రార్ధనలు చేసుకొనేందుకు వసతి ఉంది.వివిధ ఆధునిక సమాజ కేంద్రాలు కూడా మసీదు సమీపంలో ఉన్నాయి.ఇక్కడ ఖుర్ఆన్ బోధనలు మరియు ఇస్లామిక్ అధ్యయనాలు అందిస్తుంది. ఒక కార్యక్రమాలు నిర్వహించుకొనే ప్రాంగణం సైతం ఈ మసీదు సమీపంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com