జియో న్యూఇయర్ ఆఫర్..
- December 23, 2016
న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో టెలికాం కంపెనీ అలర్టయ్యాయి. రకరకాల ప్లాన్స్తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. లేటెస్ట్గా జియో మరో అడుగు ముందుకేయనుంది. ఉచిత కాల్స్, ఉచిత డేటా సౌకర్యంతో కస్టమర్స్కి చేరువైన జియో, ఈ సేవలన్నీ ఇప్పటివరకు 4జీ ఫోన్లలో మాత్రమే! తాజాగా జియో సిమ్లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా ఆ సంస్థ ఓ యాప్ను రూపొందించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల చివర లేదా వచ్చేనెలలో ఆ యాప్ని అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1న నుంచి 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. రాబోయే 3జీ జియో సిమ్ ద్వారా కస్టమర్లు పెరిగే ఛాన్స్ వుందని అప్పుడే లెక్కల్లో నిమగ్నమైంది ఆ కంపెనీ.
మరోవైపు జియో దెబ్బకు తన పాత విధానాలను సడలిస్తోంది ఎయిర్ టెల్. ముంబైలో ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల కోసం ఆ కంపెనీ సరికొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను రిలీజ్ చేసింది. కొత్త ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు తొలి మూడునెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపారు. 10 జీబీ కలిగిన బేసిక్ ప్లాన్ రూ. 599లతో ప్రారంభం అవుతుందని, అలాగే రూ. 1,299 ల రెంటల్తో నెలకు 60 జీబీ డేటా ప్లాన్ను తీసుకునేవారికి ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే తమకు 3.51 లక్షల ఫిక్స్డ్ లైన్ కస్టమర్లున్నారని, వీరిలో ఎక్కువశాతం ఎంటర్ప్రైజెస్ వినియోగదారులేనట. వి-ఫైబర్ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్లైన్ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించే విధంగా నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసింది ఎయిర్టెల్. దీనిద్వారా 100 ఎంబిపిఎస్ వరకు వేగంతో డేటాను అందించనుం
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







