ఇక అన్నిటికి ఆధార్ ఉంటే చాలు.!
- December 25, 2016
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ యాప్ ద్వారా చెల్లింపులను విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభించనున్నారు. ఇది చాలా సులువు. దీనికి కేవలం ఆధార్ నంబర్, వేలి ముద్ర వుంటే చాలు. మన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఎటువంటి కార్డులు అవసరం లేదు. పిన నంబర్లు అక్కర్లేదు. వ్యాపారులకు పోస్ యంత్రాలు అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే...ఈ లావాదేవీలపై ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఎలా పనిచేస్తుందంటే...? ఇది మొబైల్ యాప్. విక్రయదారులు స్మార్ట్ఫోనతో పాటు బయోమెట్రిక్ మిషనను సమకూర్చుకోవలసి వుంటుంది. ఇది చాలా చిన్నగా కంప్యూటర్ మౌస్లా వుంటుంది.
దాన్ని యూఎ్సబీ సాయంతో ఫోనకు అనుంధానం చేసుకోవాలి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ మొబైల్ యాప్ను డౌనలోడ్ చేసుకోవాలి. ఇక ఎవరైనా సరకుల విక్రేతకు సొమ్ము చెల్లించాలంటే...వారి స్మార్ట్ఫోనలో యాప్ ఓపెన చేయాలి. అందులో మొత్తం వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర ఇవ్వాలి. అప్పుడు యాప్లో బ్యాంక్ ఎంపిక చేసుకుని ఓకే చేయాలి. అంతే ఆ బ్యాంక్ ఖాతా నుంచి ఎంటర్ చేసిన మొత్తం విక్రేత ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో పాస్వర్డ్ లేదు. కార్డ్ లేదు. ఏమీ లేదు. చాలా సులువుగా అయిపోతుంది. అయితే బ్యాంకులో తగినంత నగదు నిల్వ వుందో లేదో చూసుకోవాలి. ఇది కొత్త విధానం. దీన్ని కలెక్టర్ ప్రవీణ్కుమార్ నగరంలో ఆదివారం ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









