ఇక అన్నిటికి ఆధార్ ఉంటే చాలు.!
- December 25, 2016
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ యాప్ ద్వారా చెల్లింపులను విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభించనున్నారు. ఇది చాలా సులువు. దీనికి కేవలం ఆధార్ నంబర్, వేలి ముద్ర వుంటే చాలు. మన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఎటువంటి కార్డులు అవసరం లేదు. పిన నంబర్లు అక్కర్లేదు. వ్యాపారులకు పోస్ యంత్రాలు అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే...ఈ లావాదేవీలపై ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఎలా పనిచేస్తుందంటే...? ఇది మొబైల్ యాప్. విక్రయదారులు స్మార్ట్ఫోనతో పాటు బయోమెట్రిక్ మిషనను సమకూర్చుకోవలసి వుంటుంది. ఇది చాలా చిన్నగా కంప్యూటర్ మౌస్లా వుంటుంది.
దాన్ని యూఎ్సబీ సాయంతో ఫోనకు అనుంధానం చేసుకోవాలి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ మొబైల్ యాప్ను డౌనలోడ్ చేసుకోవాలి. ఇక ఎవరైనా సరకుల విక్రేతకు సొమ్ము చెల్లించాలంటే...వారి స్మార్ట్ఫోనలో యాప్ ఓపెన చేయాలి. అందులో మొత్తం వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర ఇవ్వాలి. అప్పుడు యాప్లో బ్యాంక్ ఎంపిక చేసుకుని ఓకే చేయాలి. అంతే ఆ బ్యాంక్ ఖాతా నుంచి ఎంటర్ చేసిన మొత్తం విక్రేత ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో పాస్వర్డ్ లేదు. కార్డ్ లేదు. ఏమీ లేదు. చాలా సులువుగా అయిపోతుంది. అయితే బ్యాంకులో తగినంత నగదు నిల్వ వుందో లేదో చూసుకోవాలి. ఇది కొత్త విధానం. దీన్ని కలెక్టర్ ప్రవీణ్కుమార్ నగరంలో ఆదివారం ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







