'2.0' డబ్బింగ్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్
- December 27, 2016
సూపర్స్టార్ రజనీకాంత్ తన తర్వాతి చిత్రం '2.0'కి డబ్బింగ్ చెబుతున్నారు. అకాడమీ అవార్డు విజేత సౌండ్ ఇంజనీరు రసూల్ పోకుట్టి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రజనీకాంత్ డబ్బింగ్ ప్రారంభించడం కోసం చెన్నై వెళ్తున్నానని తొలుత ట్వీట్ చేసిన ఆయన తర్వాతి ట్వీట్లలో రజనీని ప్రశంసలతో ముంచెత్తారు. పనిపట్ల తలైవాకున్న అంకితభావం సామాన్యమైనది కాదని, ఒక్కరోజులోనే మూడు రీళ్లు పూర్తి చేశారని, ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోయానని రసూల్ ట్వీట్ చేశారు.
'2.0' సీక్వెల్ కాదని, ఇది పూర్తిగా విభిన్నమైన చిత్రమని రసూల్ అన్నారు.
దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించగా, అమీజాక్సన్ కథానాయిగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







