బకాయిల చెల్లింపుపై కార్మికుల ఆందోళన ..

- December 28, 2016 , by Maagulf
బకాయిల చెల్లింపుపై కార్మికుల ఆందోళన ..

బైసన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ ఉద్యోగులు, తమకు యాజమాన్యం బకాయి పడ్డ వేతనాల చెల్లింపు కోసం ఆందోళన బాట పట్టాయి. గతంలో ఈ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చూసుకున్న రామీ గ్రూప్‌పై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 65 మంది ఉద్యోగులు, ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ డ్యూస్‌ చెల్లింపులు లేక ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌ 2016 వరకు రామీ గ్రూప్‌ ఈ హోటల్స్‌ని నిర్వహిస్తూ వచ్చింది. మేనేజ్‌మెంట్‌ మార్పు సమయంలో రామీ గ్రూప్‌, ఆ ఉద్యోగులకు చెల్లింపులపై హామీ ఇచ్చినా, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. గతంలో రామీ గ్రూప్‌ తరఫున పనిచేసిన ఆ ఉద్యోగులు ఇప్పుడు బైసన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లోనే వేరే మేనేజ్‌మెంట్‌తో పనిచేస్తున్నారు. బకాయిల్ని పాత మేనేజ్‌మెంట్‌ చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ జీతాల్ని పొందే హక్కుని కలిగి ఉన్నారనీ, మేనేజ్‌మెంట్‌కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసే అధికారం వారికి ఉందని ఓ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com