రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్..

- December 30, 2016 , by Maagulf
రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్..

శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో BCAS ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జనవరి 30 వరకూ నెల రోజులపాటు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని BCAS ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు సందర్శకుల పాసులను రద్దు చేసింది. కేవలం ప్రయాణికులను మాత్రమే ఏర్ పోర్టులోకి అనుమతిస్తారు. సందర్శకులను కేవలం పార్కింగ్ ఏరియా వరకే వెళ్లనిస్తారు. శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ CISF సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com