అక్రమ ప్రవేశం : ముగ్గురికి జైలు
- December 30, 2016
మనామా: జిసిసి జాతీయులు ముగ్గురు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. అందులో ఒకరికి స్వదేశంలో ఏడాది జైలు శిక్ష ఉంది. అతనిలాగే ఉండే మరో వ్యక్తికి చెందిన డాక్యుమెంట్లతో మరో ఇద్దరు వ్యక్తులు అతన్ని దేశంలోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి సమాచారం అందుకోగానే, పోలీసులు వారు బస చేసిన హోటల్ రూమ్లో తనిఖీలు నిర్వహించి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నా, అతని తరఫున ఎలాంటి తప్పిదం జరగకపోవడంతో అతన్ని విడిచిపెట్టారు. ఈ కేసులో తొలి నిందితుడు ఫోర్జరీ కేసులోనూ బుక్కయ్యాడు. మరో ఇద్దరు, అతనికి సహాయ పడ్డ కేసులో శిక్షకు గురయ్యారు. జైలు శిక్ష పూర్తయ్యాక ఈ ముగ్గుర్నీ దేశం నుంచి పంపేస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







