'భీమ్‌' ను లాంచ్ చేసిన మోదీ

- December 30, 2016 , by Maagulf
'భీమ్‌' ను లాంచ్ చేసిన మోదీ

దిల్లీలోని తలక్‌ తోర మైదానంలో డిజీధన్‌ మేళా జరిగింది. ఈ సందర్భంగా డిజిటల్‌ లావాదేవీలు సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'భీమ్‌' పేరుతో కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న వారిలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎ.బాబు కూడా ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... డిజిటల్‌ లావాదేవీల వల్ల పన్నుల వసూళ్లు పెరుగుతాయన్నారు. నవంబర్‌ 8 తర్వాత డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయని తెలిపారు. ఆధార్‌ చెల్లింపుల ద్వారా దేశంలో పెనుమార్పు వస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com