చమురు ధరల తగ్గుదలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు
- September 09, 2015
ఒమాన్ దేశ ఆర్ధిక వ్యవహారాలు మరియు శక్తి వనరుల మండలి యొక్క2015 సంవత్సరపు 5వ సమావేశం, ఆర్ధిక వ్యవహారాల మంత్రి మరియు మండలి డెప్యూటీ ఛైర్మన్ - డర్వీ బిన్ ఇస్మైల్ బిన్ అలీ అల్ బాలుషీ వారి అధ్యక్షతన ఈ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో- ప్రపంచ విపణిలో చమురు ధరల నేపధ్యం మరియు 2015 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు నెలల మధ్య వ్యవధిలో అకౌంట్లు, వాటి ఫలితాలు వంటి విషయాలను సమీక్షించారు. చమురు ధరల తగ్గుదల యొక్క ఫలితాలను అధిగమించేందుకు, వ్యయాల క్రమబద్ధీకరణ మరియు ఇంధనేతర వనరుల నుండి ఆదాయం పెంపుదల వంటి చర్యలు తోడ్పడ్దాయని మండలి తెలియజెప్పింది. ఈ లోటును ఎదుర్కోవడానికి, సుల్తానేట్ ఆర్ధిక స్థితి పెంపుదలకు అవసరమైన మరిన్న చర్యలను గురించి కూడా చర్చించింది. ఇంకా, మధ్య మరియు దీర్ఘకాల వ్యవధిలో ఆర్ధిక స్థితిని పెంపొందించడానికి అవసరమైన అధ్యయనం కోసం, ప్రత్యేక బృందాల ఏర్పాటును సిఫార్సు చేసింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







