చమురు ధరల తగ్గుదలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు
- September 09, 2015
ఒమాన్ దేశ ఆర్ధిక వ్యవహారాలు మరియు శక్తి వనరుల మండలి యొక్క2015 సంవత్సరపు 5వ సమావేశం, ఆర్ధిక వ్యవహారాల మంత్రి మరియు మండలి డెప్యూటీ ఛైర్మన్ - డర్వీ బిన్ ఇస్మైల్ బిన్ అలీ అల్ బాలుషీ వారి అధ్యక్షతన ఈ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో- ప్రపంచ విపణిలో చమురు ధరల నేపధ్యం మరియు 2015 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు నెలల మధ్య వ్యవధిలో అకౌంట్లు, వాటి ఫలితాలు వంటి విషయాలను సమీక్షించారు. చమురు ధరల తగ్గుదల యొక్క ఫలితాలను అధిగమించేందుకు, వ్యయాల క్రమబద్ధీకరణ మరియు ఇంధనేతర వనరుల నుండి ఆదాయం పెంపుదల వంటి చర్యలు తోడ్పడ్దాయని మండలి తెలియజెప్పింది. ఈ లోటును ఎదుర్కోవడానికి, సుల్తానేట్ ఆర్ధిక స్థితి పెంపుదలకు అవసరమైన మరిన్న చర్యలను గురించి కూడా చర్చించింది. ఇంకా, మధ్య మరియు దీర్ఘకాల వ్యవధిలో ఆర్ధిక స్థితిని పెంపొందించడానికి అవసరమైన అధ్యయనం కోసం, ప్రత్యేక బృందాల ఏర్పాటును సిఫార్సు చేసింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









