1.2 కిలోల గోల్డ్‌ బిస్కట్లను స్వాధీనం..

- December 31, 2016 , by Maagulf
1.2 కిలోల గోల్డ్‌ బిస్కట్లను స్వాధీనం..

అక్రమంగా గోల్డ్‌ బిస్కెట్లను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డబీర్‌పురకు చెందిన మహ్మద్‌ అమీర్‌ అహ్మద్‌, మహ్మద్‌ ఫసీద్దీన్‌, ఫహద్‌యక్‌ ఖాన్‌లు నిందితులు. వీరు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన బంగారు బిస్కట్లను సౌదీ అరేబియా నుంచి నగరానికి తీసుకొచ్చి పలువురికి వి క్రయించేవాళ్లు. ఇందుకు బ్రోకర్లను సంప్రదించి వారికి కమీషన్‌ ఇచ్చి కొనుగోలు దారుల గురించి తెలుసుకొని వారికి విక్రయించేవాళ్లు. ఇందు లో భాగంగా సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి ఫారిన్‌ ఒరిజిన్‌ బిస్కట్ల ను ఎయిర్‌ ఇండియా విమానంలో శనివారం తీసుకొస్తుండగా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com