ఇస్తాంబుల్లో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్..
- January 01, 2017
బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, టర్కీలోని ఇస్తాంబుల్లో తీవ్రవాదులు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన బహ్రెయిన్, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచమంతా తీవ్రవాదాన్ని ఖండించాలనీ, తీవ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. బహ్రెయిన్, టర్కీకి ఆపద సమయంలో అండగా ఉంటుందని సంతాప సందేశంలో బహ్రెయిన్ పేర్కొంది. బహ్రెయిన్ ప్రజలందరి తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







