ఇస్తాంబుల్లో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్..
- January 01, 2017
బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, టర్కీలోని ఇస్తాంబుల్లో తీవ్రవాదులు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన బహ్రెయిన్, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచమంతా తీవ్రవాదాన్ని ఖండించాలనీ, తీవ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. బహ్రెయిన్, టర్కీకి ఆపద సమయంలో అండగా ఉంటుందని సంతాప సందేశంలో బహ్రెయిన్ పేర్కొంది. బహ్రెయిన్ ప్రజలందరి తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







