సోమాలియా ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు..ముగ్గురి మృతి

- January 02, 2017 , by Maagulf
సోమాలియా ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు..ముగ్గురి మృతి

సోమాలియా రాజధాని మొగదిషులోనివిమానాశ్రయంలో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. అనంతరం భారీగా కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. పేలుళ్లలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో సిబ్బంది లేని చెక్‌పాయింట్‌ వద్ద మొదటి పేలుడు సంభవించింది. అనంతరం పీస్‌ హోటల్‌ ఆవరణలో రెండో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు ధ్వంసం అవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదు కానీ ఇంతకుముందు అల్‌ షబాబ్‌ ఉగ్రవాదులు పలుమార్లు సోమాలియాపై విరుచుకుపడ్డారు.అదీకాకుండా సోమాలియా ఫెడరల్‌ పార్లమెంట్‌ త్వరలో తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com