సోమాలియా ఎయిర్పోర్ట్లో పేలుళ్లు..ముగ్గురి మృతి
- January 02, 2017
సోమాలియా రాజధాని మొగదిషులోనివిమానాశ్రయంలో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. అనంతరం భారీగా కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. పేలుళ్లలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో సిబ్బంది లేని చెక్పాయింట్ వద్ద మొదటి పేలుడు సంభవించింది. అనంతరం పీస్ హోటల్ ఆవరణలో రెండో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు ధ్వంసం అవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదు కానీ ఇంతకుముందు అల్ షబాబ్ ఉగ్రవాదులు పలుమార్లు సోమాలియాపై విరుచుకుపడ్డారు.అదీకాకుండా సోమాలియా ఫెడరల్ పార్లమెంట్ త్వరలో తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







