ఆన్లైన్లోనే హజ్ యాత్రకు దరఖాస్తులు
- January 02, 2017
డిజిటల్ ఇండియా దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వీలైనన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ముస్లింల పవిత్ర హజ్యాత్రకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఆన్లైన్ చేశారు. 'దేశంలో తొలిసారి హజ్యాత్రకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిజిటల్ వేదికగా జరగనుంది' అని మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అభివర్ణించారు. 'మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తోంది.
హజ్ యాత్రకు సంబంధించిన ప్రక్రియను ఆన్లైన్ చేశాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ సౌకర్యవంతంగా, పారదర్శకంగా ఉంటుంది' అని నఖ్వీ పేర్కొన్నారు.
హజ్యాత్రకు సంబంధించిన మొబైల్యాప్ను సైతం ప్రారంభించినట్లు నఖ్వీ తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేటి నుంచి హజ్యాత్రకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని జనవరి 24 వరకు ముస్లింలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.
యాత్రకు సంబంధించిన సమాచారం, వార్తలు, అప్డేట్లు, ఈ-పేమెంట్లతో యాప్ను రూపొందించారు. అప్లికేషన్ సైతం యాప్లోనే పొందుపరిచారు. ఐదుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఒక బృందంగా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. పీడీఎఫ్ కాపీ దరఖాస్తు దారు ఈ-మెయిల్ చిరునామాకు వెళ్తుంది. అన్ని వివరాలను నింపిన దరఖాస్తుపై ఫొటోను అంటించి స్టేట్ హజ్కమిటీలకు పంపాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును సైతం యాప్ ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలు హజ్యాత్రకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించిన వెబ్సైట్ను చూడవచ్చు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







