బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల కలకలం !
- January 02, 2017
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులు హరితర్ తర్జు ప్రాంతంలో సంచరింస్తున్నారని సమాచారం అందుకున్న జవాన్లు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదని జవాన్లు హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో నక్కినట్లు జవాన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆర్మీ కూంబింగ్ జరుపుతోంది. దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో బారాముల్లా జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







