రోడ్డుప్రమాదంలో 25 మంది సజీవదహనం..

- January 02, 2017 , by Maagulf
రోడ్డుప్రమాదంలో 25 మంది సజీవదహనం..

ఆగ్రేయ ఆసియా దేశం థాయిలాండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతోన్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగారని, ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్‌ జిల్లా పోలీసు అధికారి కల్నల్‌ దుసాదీ మీడియాకు తెలిపారు.

'అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com