రోడ్డుప్రమాదంలో 25 మంది సజీవదహనం..
- January 02, 2017
ఆగ్రేయ ఆసియా దేశం థాయిలాండ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చోన్బురి ఫ్రావిన్స్, బన్బుంగ్ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతోన్న వ్యాన్ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వ్యాన్లో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగారని, ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్బుంగ్ జిల్లా పోలీసు అధికారి కల్నల్ దుసాదీ మీడియాకు తెలిపారు.
'అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







