ఈ నెల 12 నుంచి బెజవాడలో ఎయిర్ షో
- January 05, 2017
దేశంలో అత్యధిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. విజయవాడలో జనవరి 12 నుంచి 14 వరకు జరిగే విమానయాన సదస్సు, ఎయిర్ షో గోడ పత్రికను గురువారం దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 200మంది దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారని వెల్లడించారు.రీజినల్ కనెక్టివిటీపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందని చెప్పారు. ఎయిర్షోను యునైటెడ్ కింగ్డమ్ నిర్వహిస్తుందన్నారు. జనవరి 12న విజయవాడ రన్వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. రూ.130 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ప్రారంభిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







