ఈ నెల 12 నుంచి బెజవాడలో ఎయిర్ షో
- January 05, 2017
దేశంలో అత్యధిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. విజయవాడలో జనవరి 12 నుంచి 14 వరకు జరిగే విమానయాన సదస్సు, ఎయిర్ షో గోడ పత్రికను గురువారం దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 200మంది దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారని వెల్లడించారు.రీజినల్ కనెక్టివిటీపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందని చెప్పారు. ఎయిర్షోను యునైటెడ్ కింగ్డమ్ నిర్వహిస్తుందన్నారు. జనవరి 12న విజయవాడ రన్వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. రూ.130 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ప్రారంభిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









