గల్ఫ్‌కు తరలిస్తున్న గంజాయి పట్టివేత....

- January 05, 2017 , by Maagulf
గల్ఫ్‌కు తరలిస్తున్న గంజాయి పట్టివేత....

రాజంపేట టౌన్(కడప) : గల్ఫ్‌దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంభందించి డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌, చిత్తూరు జిల్లా తట్టివేడు మండలం సి.పి.ఎన్.కండ్రికకు చెందిన వెంకటేశ్వర్లును మన్నూరు సీఐ హేమ సుందర్‌రావు పోలీస్‌ సిబ్బందితో దేవసముద్రం ఆంజనేయ విగ్రహం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 3కేజీల గంజాయి ఉండ టంతో వారిని పట్టుకొని అరెస్ట్‌ చేశామని, వారు కువైత్‌లోని స్మగ్లర్లకు, గల్ఫ్‌దేశాల స్మగ్లర్లకు ఈ గంజాయిని సరఫరా చేసేవారన్నారు. అలాగే 3వ తేదీన మన్నూరు స్టేషన్ పరిధిలో 6.2 కేజీల గంజాయి, ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు.
గంజాయి, మాదకద్ర వ్యాలు కలిగిన ఉన్న వారిపై అక్రమరవాణా చేసేవారిపై స్మగ్లర్లపై ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘాను ఉంచి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com