అమెరికా రాయబారి పదవినుండి వైదొలగనున్న రిచర్డ్ రాహుల్వర్మ
- January 07, 2017
భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ రాహుల్వర్మ జనవరి 20కి ముందే తన పదవి నుంచి వైదొలగనున్నారు! ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించిన రాయబారులను కొనసాగించేందుకు అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే కొందరు అధికారులు వైదొలగనున్నారు.
అమెరికాలో ఈ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్ రిచర్డ్వర్మ (48) కావడం విశేషం. ఆయన హయాంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి. అమెరికా చట్టసభల్లో భారత్కు అనుకూలంగా పౌర అణు ఒప్పందం ఆమోదింపచేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014లో అమెరికాలో భారత రాయబారి దేవయానీ కోబ్రాగడే వివాదం కారణంగా అప్పటి అమెరికా రాయబారి నాన్సీపావెల్ స్థానంలో రిచర్డ్వర్మను ఒబామా నియమించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









