ఎయిర్ ఇండియా విమానాల్లో ప్లాస్టిక్ బేడీలు సిద్ధం
- January 07, 2017
కామాంధులు విమానాల్లో కూడా తమ దుర్బుద్ధిని ప్రదర్శిస్తుండటంతో ఎయిరిండియా కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. రెండు వారాల్లోనే ఇద్దరు ప్రయాణికులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అధికారులు గట్టి నిర్ణయాలను ప్రకటించారు. విమానానికిగానీ, ఇతర ప్రయాణికులకు కానీ ప్రమాదకరంగా పరిణమించే ప్రయాణికులను సీట్లకు కట్టేసేందుకు ప్లాస్టిక్ బేడీలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహానీ మాట్లాడుతూ రెండు జతల ప్లాస్టిక్ బేడీలను అన్ని విమానాల్లోనూ సిద్ధంగా ఉంచుతామన్నారు. గతంలో కేవలం అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే వీటిని ఉంచేవారమని, ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. విమానం, ప్రయాణికులు సురక్షితంగా ఉండటమే తమకు అత్యంత ప్రధాన విషయమని తెలిపారు. భద్రతకే తాము ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







