ఎయిర్ ఇండియా విమానాల్లో ప్లాస్టిక్ బేడీలు సిద్ధం
- January 07, 2017
కామాంధులు విమానాల్లో కూడా తమ దుర్బుద్ధిని ప్రదర్శిస్తుండటంతో ఎయిరిండియా కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. రెండు వారాల్లోనే ఇద్దరు ప్రయాణికులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అధికారులు గట్టి నిర్ణయాలను ప్రకటించారు. విమానానికిగానీ, ఇతర ప్రయాణికులకు కానీ ప్రమాదకరంగా పరిణమించే ప్రయాణికులను సీట్లకు కట్టేసేందుకు ప్లాస్టిక్ బేడీలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహానీ మాట్లాడుతూ రెండు జతల ప్లాస్టిక్ బేడీలను అన్ని విమానాల్లోనూ సిద్ధంగా ఉంచుతామన్నారు. గతంలో కేవలం అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే వీటిని ఉంచేవారమని, ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. విమానం, ప్రయాణికులు సురక్షితంగా ఉండటమే తమకు అత్యంత ప్రధాన విషయమని తెలిపారు. భద్రతకే తాము ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







