ఉత్తర్ప్రదేశ్లో నైట్ షెల్టర్లోకి దూసుకెళ్లిన కారు, 4 మృతి
- January 07, 2017
ఒక నైట్ షెల్టర్లోకి కారు దూసుకెళ్లి నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడినసంఘటన ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. లఖ్నవూ నడిబొడ్డున దలీబాగ్ ప్రాంతంలో ఒక హుందాయ్ ఐ 20కారు నైట్షెల్టర్లోకి వేగంగా దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన సమయంలో ఆ షెల్టర్లో దాదాపు 35 మంది కూలీలు నిద్రిస్తున్నారు. వీరంతా రోజు కూలీ నిమిత్తం బరాచీ జిల్లా నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు వారిని పట్టుకున్నారు. వీరిలో ఒకరు స్థానిక రాజకీయ నాయకుడి కుమారుడు కాగా మరొకరు ఓ వ్యాపారవేత్త కుమారుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







