ఉత్తర్‌ప్రదేశ్‌లో నైట్‌ షెల్టర్‌లోకి దూసుకెళ్లిన కారు, 4 మృతి

- January 07, 2017 , by Maagulf
ఉత్తర్‌ప్రదేశ్‌లో నైట్‌ షెల్టర్‌లోకి దూసుకెళ్లిన కారు, 4 మృతి

ఒక నైట్‌ షెల్టర్‌లోకి కారు దూసుకెళ్లి నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడినసంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. లఖ్‌నవూ నడిబొడ్డున దలీబాగ్‌ ప్రాంతంలో ఒక హుందాయ్‌ ఐ 20కారు నైట్‌షెల్టర్‌లోకి వేగంగా దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన సమయంలో ఆ షెల్టర్‌లో దాదాపు 35 మంది కూలీలు నిద్రిస్తున్నారు. వీరంతా రోజు కూలీ నిమిత్తం బరాచీ జిల్లా నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు వారిని పట్టుకున్నారు. వీరిలో ఒకరు స్థానిక రాజకీయ నాయకుడి కుమారుడు కాగా మరొకరు ఓ వ్యాపారవేత్త కుమారుడిగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com