సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పిల్లల ఇరువురు మరణంపై పరిశోధన

- January 08, 2017 , by Maagulf
సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పిల్లల ఇరువురు మరణంపై పరిశోధన

మనామా: గత వారం అనుమానిత వైద్య నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిల్లల మరణంకు దారి తీసిన పరిస్థితులపై బహ్రెయిన్ ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ విచారణ ప్రారంభించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో  వైద్య సహాయం కోసం ఎదురుచూస్తూ లయల అనే బహ్రేయినీ బాలిక తన తండ్రి చేతుల్లోనే విషాదంగా మరణించింది. ఇదే విధంగా మరో బహ్రేయినీ బాలుడు యూసీఫ్ ఆసుపత్రికి చేరుకొనే మార్గంలోనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్  వైద్యులు విధించిన జరిమానా కారణంగా మరణించాడు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ మరియం అల్ జలహ్మ మాట్లాడుతూ చనిపోయిన పిల్లల కుటుంబాల నుండి ఒక అధికారిక ఫిర్యాదు అందలేదని అయితే వారి మరణంకు సంబంధించిన కేసులు దర్యాప్తు ప్రక్రియలో అది కీలకమని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com