ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ కన్నుమూత
- January 08, 2017
టెహ్రాన్, జనవరి 8: ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ రఫ్సంజానీ ఆదివారం కన్నుమూశారు. మతవాద దేశంలో ఆధునికతకు బాటలు వేసిన ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మల్టీమిలియనీర్ అయిన ఈయన రాజకీయాల్లో, వ్యాపారంలో ఎత్తుజిత్తుల్లో సుప్రసిద్ధుడు.
అందుకే ఆయన్ను అక్బర్ షా, గ్రేట్ కింగ్ అని పిలుస్తారు. 1989 నుంచి 1997 వరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో జరిగిన ఇరాన్ విప్లవంలో ఆయనది కీలక భూమిక. ఇరాన్ మధ్యతరగతి, సంపన్న వర్గాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
మితవాద ఇరాన్లో ఆర్థిక సంస్కరణలు అమలుచేసిన ఘనత ఆయనదే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







