దక్షిణ థాయ్లాండ్లో వరదలు..35 మంది మృతి....
- January 09, 2017
సూరత్థానీ: థాయ్లాండ్లో వరదలు ముంచెత్తాయి. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నిత్యావసరాలు అందుబాటులో లేక కష్టాలు తప్పడం లేదు. అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దక్షిణ థాయ్లాండ్లోని సూరత్ధానీ రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా వరదలు ఏర్పడ్డాయి. జనవరి 1 నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 10 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 20 జాతీయ రహదారులపై వరదల ప్రభావం కనిపించింది. భారీ వర్షాల అనంతరం వరదల తాకిడికి 35 మంది చనిపోయినట్లు థాయ్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల చుట్టూ వరద నీరు పేరుకుపోవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి. సరుకులు తెచ్చుకునే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. 60 వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దాంతో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు.
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







