తీవ్రవాదుల మద్దతుదారునికి జైలుశిక్ష విధించిన రియాద్ కోర్టు
- January 09, 2017
జెడ్డా : సిరియా ఉగ్రవాదంలో పాల్గొనడానికి టర్కీ ప్రయాణిస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక సౌదీ వ్యక్తికి ఏడున్నర సంవత్సరాల జైలుశిక్షను రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం విధించారు. తన తప్పును అంగీకరించిన నిందితుడు అల్ నుస్ర తీవ్రవాద సంస్థలో సభ్యునిగా చేరాడు. ఆ బృందానికి వదిలివచ్చే ముందు అక్కడ సభ్యుల నుండి శిక్షణ పొందాడు. తనకు శిక్షణ ఇచ్చిన వారు గూర్చి గాని,టెర్రరిస్ట్ సమూహానికి చెందిన ఇతర పేర్లను అధికారుల ముందు వెల్లడించడానికి నిరాకరించాడు. న్యాయస్థానం ఎదుట దోషిగా నిలబడిన ఈ సౌదీ పౌరుడు అల్ ఖ్అస్సిమ్ నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు భద్రతాదళం ఆధీనంలో ఉన్న కొంతమంది ఖైదీలను విడిపించిందేకు ఆర్థికంగా సహాయపడ్డాడు భద్రతా సందర్భాల్లో అదుపులోకి తీసుకొనబడిన మహిళలకు మద్దతు ఇచ్చేందుకు అలాగే వారి విడుదల చేయటానికి ద్రవ్యం సమకూర్చాడు. అంతేకాక ఈ నిందితుడు సిరియాలో హింసాత్మక చర్యలు, యుద్ధ మద్దతు తెలిపిన ఒక మహిళ నుండి 4,000 సౌదీ రియాళ్లను సైతం పొందాడు మరియు యెమెన్ లో పోరాడటానికి మహిళ ఎదుట కోరిక వ్యక్తం చేశాడు. ఆ సౌదీ వ్యక్తి దేశం యొక్క భద్రత బెదిరించే విధంగా సిరియా మహిళ ప్రయాణం చేసేందుకు సహాయం చేయాలని జనాలతో సామాజిక మీడియా ద్వారా సమస్యలను పోస్టు చేస్తూ సోషల్ మీడియా ఉపయోగించాడు. తదితర కారణాలతో రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఆ నిందితుడు విడుదలైన తరువాత సైతం దేశం విడిచి వెళ్లరాదని 10 సంవత్సరాల ప్రయాణ నిషేధం ఇవ్వబడింది, కానీ ఆ నిందుతుని తాను చేసిన చర్యలకు పశ్చాత్తాపం పడటం గమనించింది. దీనితో కోర్టు మూడు సంవత్సరాలు శిక్షను రద్దు చేయడానికి నిర్ణయించుకుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







