ముంబయిలో అతిపెద్ద పబ్లిక్ వైఫై సర్వీసు...
- January 09, 2017
ముంబయి: ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 500 వైఫై హాట్స్పాట్లను ప్రకటించింది. మే 1 నాటికి ఆ సంఖ్య 1200కి చేరేలా ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ముంబయి వైఫై సర్వీసు భారత్లోనే అతిపెద్ద పబ్లిక్వైఫై సర్వీస్గా ఉందని, ప్రపంచంలో ఒకటిగా నిలిచిందని సీఎం ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. వైఫై సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి పనితీరు, వేగంగా ఉందా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఆయన తెలిపారు. ప్రయోగాత్మక దశలో భాగంగా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నగరం మొత్తం మీద 23వేల మంది యూజర్లు 2టీబీ పైన డేటాను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









