బ్రోతల్ హౌస్ నిర్వహణ: నలుగురి అరెస్ట్
- January 10, 2017
నలుగురు నిరుద్యోగులపై బ్రోతల్ హౌస్ ఆరోపణలపై కేసులు నమోదు చేయబడ్డాయి. స్వదేశం నుంచి మహిళల్ని అక్రమంగా తరలించి, వ్యభిచార కార్యకలాపాల్ని ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తూ నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ వ్యక్తులందరూ 20 నుంచి 24 ఏళ్ళ వయసువారే. నలుగురికీ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటనలో బాధితురాలైన వియాత్నాంకి చెందిన మహిళ, జరిగిన ఘటనను వివరించింది. ఎయిర్పోర్ట్లో తనను కొందరు వ్యక్తులు కలుసుకున్నారనీ, వారు తనను బలవంతంగా ఫ్లాట్కి తీసుకెళ్ళి, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారనీ, వారి మాట వినకపోవడంతో తనను దారుణంగా కొట్టారని న్యాయస్థానానికి తెలిపింది. తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అలాగే ఎంబసీకి వివరాలు తెలిపి ఎలాగోలా బయటపడ్డానని ఆమె వివరించింది. బాధితురాలు, నలుగురు నిందితుల్ని గుర్తించింది. దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్లో బాధితురాలికి ఆవాసం కల్పించారు అధికారులు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







