బ్రోతల్ హౌస్ నిర్వహణ: నలుగురి అరెస్ట్
- January 10, 2017
నలుగురు నిరుద్యోగులపై బ్రోతల్ హౌస్ ఆరోపణలపై కేసులు నమోదు చేయబడ్డాయి. స్వదేశం నుంచి మహిళల్ని అక్రమంగా తరలించి, వ్యభిచార కార్యకలాపాల్ని ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తూ నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ వ్యక్తులందరూ 20 నుంచి 24 ఏళ్ళ వయసువారే. నలుగురికీ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటనలో బాధితురాలైన వియాత్నాంకి చెందిన మహిళ, జరిగిన ఘటనను వివరించింది. ఎయిర్పోర్ట్లో తనను కొందరు వ్యక్తులు కలుసుకున్నారనీ, వారు తనను బలవంతంగా ఫ్లాట్కి తీసుకెళ్ళి, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారనీ, వారి మాట వినకపోవడంతో తనను దారుణంగా కొట్టారని న్యాయస్థానానికి తెలిపింది. తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అలాగే ఎంబసీకి వివరాలు తెలిపి ఎలాగోలా బయటపడ్డానని ఆమె వివరించింది. బాధితురాలు, నలుగురు నిందితుల్ని గుర్తించింది. దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్లో బాధితురాలికి ఆవాసం కల్పించారు అధికారులు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









