స్వాధీనం చేసుకున్న పౌల్ట్రీ ధ్వంసం

- January 10, 2017 , by Maagulf
స్వాధీనం చేసుకున్న పౌల్ట్రీ ధ్వంసం

మనామా: పెద్ద మొత్తంలో ఫ్రోజెన్‌ పౌల్ట్రీని గుర్తించిన అధికారులు, దాన్ని ధ్వంసం చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ - అగ్రికల్చర్‌ ఎఫైర్స్‌ అండ్‌ మెరైన్‌ రిసోర్సెస్‌ వర్గాలు, ఈ విషయాన్ని ధృవీకరించాయి. 25 టన్నుల బరువైన ఈ షిప్‌మెంట్‌ని నిశితంగా పరిశీలించిన మీదట, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు ఆహారంగా తీసుకోదగ్గది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారణ ప్రారంభించింది. ఈ షిప్‌మెంట్‌ ఇలా ఇంపోర్ట్‌ అయ్యింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నేరపూరిత ఆలోచనలతోనే దీన్ని తీసుకొచ్చిరని తేలితే నిందితులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీస్‌ అండ్‌ గవర్నరమెంటల్‌ డైరెక్టరేట్స్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌, అడ్వొకేట్‌ జనరల్‌ మమ్‌దౌ అల్‌ మావ్దా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com